Muslims across India celebrated the Id-ul-Zuha, one of the two most important festivals of the Islamic calendar. Prime Minister Narendra Modi also greeted the nation and wished for harmony and brotherhood in the society. <br />ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ఈద్-ఉల్-జుహా(బక్రీద్). దైవప్రవక్త అజ్రత్ ఇబ్రహాం త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈద్-ఉల్-జుహా (బక్రీద్) పండుగ సందర్భంగా దేశంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ మోది శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈద్ ముబారక్ సంబరాలు జరుగుతున్నాయి. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సైతం ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్షమను, త్యాగాన్ని గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలన్న సందేశాన్నిచ్చేదిగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
