YCP Chief YS Jagan Mohan Reddy temporarily stopped his Prajasankalpa Yaatra and attended CBI Court here in Hyderabad on Friday. During the arguments in Jagan Case.. Judge fired on Jagan's advocate when he pleads to combine the discharge petitions with 4 chargesheets. <br /> <br />వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగు చార్జిషీట్లపై డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. <br />దీంతో.. ''రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారు. మీ తీరుతో విసిగిపోయా! ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారు? అనవసరమైన విషయాలతో రోజుల తరబడి వాదనలు వినిపిస్తున్నారు. నా 30 ఏళ్ల సర్వీసులో ఎక్కడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు. ఇక నుంచి ఇలా కుదరదు..' అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.సీబీఐ దాఖలు చేసిన సీసీ 9కేసు చార్జిషీటును పక్కన పెట్టాలంటూ జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపించేందుకు సిద్ధమవుతుండగా... జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కల్పించుకున్నారు. 8, 10, 14 చార్జిషీట్ల డిశ్చార్జ్ పిటిషన్లను కూడా కలిపి విచారించాలని ఆయన కోరారు. ఇందుకు అనుమతిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే దీనిపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో తనకు తెలుసని అంటూ వాదనలు వినిపించాలని సీబీఐ తరఫు స్పెషల్ పీపీ సురేందర్ను ఆదేశించారు.
