CM KCR received the confirmation of Modi’s visit to the Miyapur metro station from Prime Minister’s Office. <br />మెట్రో ప్రారంభంపై ఉన్న అన్ని అనుమానాలు తీరిపోయాయి. ఇప్పటికే సీఎంఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు ప్రధాని కార్యాలయం కూడా స్పష్టతనిచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. <br /> <br />ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలు.. నవంబర్ 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. <br />అనంతరం 3.25కి వారంతా మియాపూర్ మెట్రోరైల్ స్టేషన్కు చేరుకుంటారు. మోడీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్ నుంచి కూకట్పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్కు వస్తారు. ఆ తర్వాత స్టేషన్ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. <br />
