AP Assembly Unanimously Passed Kapu Reservation Bill. It's a strategical move by CM to divert Polavaram issue. <br /> <br />ఓ వివాదాన్ని సద్దుమణిగించాలంటే.. మరో వివాదాన్ని తెర పైకి తీసుకురావడం రాజకీయ చాణక్యం. ఇన్నాళ్లు నానుస్తూ వచ్చిన కాపు రిజర్వేషన్ల బిల్లును హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం ఈ చాణక్యానికి నిదర్శనం. పోలవరం ప్రాజెక్టుపై హాట్ హాట్ చర్చ నడుస్తున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టించడం రాజకీయ ఎత్తుగడ అనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై నిందలు వినిపిస్తున్న తరుణంలో.. ఆ చర్చ లేకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా బిల్లును తెర పైకి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. <br /> <br />పోలవరం విషయంలో తాను చేయాల్సినంతా చేస్తున్నా.. కేంద్రం వైఖరి వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందనేలా చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఒకవిధంగా తప్పంతా ప్రధాని మోడీపైనే నెట్టేసే ప్రయత్నమిది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరమేముంది?. తీరా ఆ బాధ్యతలు తీసుకుని ఇప్పుడు కేంద్రం మీద నిందలు మోపితే లాభమేముంది?. ప్రాజెక్టు కేంద్రమే చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు చేసే ఆరోపణలకు జనంలో విశ్వసనీయత ఉండేది. <br />