BCCI on Monday met in New Delhi for its Special General Body meeting to decide on a slew of important on field and off field matters.India will play Afghanistan in a Test in the 2019-2020 season. <br /> <br />న్యూ ఢిల్లీలో సోమవారం బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సమావేశమైంది. ఇందులో కొన్ని కొత్త సూచనలను తీసుకొచ్చింది. 2023 ప్రపంచ కప్ వన్డే సిరీస్ ను ఉద్దేశించి జరిగిన సమావేశంలో జరిపిన ముఖ్యాంశాలు ఏమిటంటే <br />1. 2019-2020 సీజన్కి గాను అఫ్ఘనిస్థాన్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్లో తలపడనుంది. కాగా అఫ్ఘనిస్థాన్ జట్టు కు ఇదే తోలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. అది కూడా భారత్ తో జరగడం మరొక విశేషం. ఇక <br />ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి భారత్ నే ఆతిథ్యం ఇవ్వనుంది కూడా. అంతేకాదు <br />2. 2023 ప్రపంచ కప్ 50 ఓవర్ల వన్డే మ్యాచ్కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంతకుముందు 2011 ప్రపంచ కప్ మ్యాచ్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ధోని సారథ్యంలో జరిగిన ఈ సిరీస్లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. 2015 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మధ్య జరగగా ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక 2019 ప్రపంచ కప్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే 2023 ప్రపంచ కప్ కు మళ్ళి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది