Uttar Pradesh chief minister Yogi Adityanath and Samajwadi Party leader Azam Khan were captured on camera walking hand-in-hand on Thursday at the state assembly corridors. <br /> <br />ఉత్తరప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభకు వస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ నేత ఆజంఖాన్.. ఒకే సమయంల అసెంబ్లీ కారిడార్లోకి అడుగుపెట్టారు. ఒకరినొకరు చూసుకుని సరదాగా పలకరించుకున్నారు. <br />చేతులు కలిపి నడస్తూ.. వివిధ అంశాలలపై చర్చించారు యోగి-ఆజంఖాన్. ఈ పరిణామం అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత వారిని ఆకట్టుకుంది. ఆజంఖాన్ తోపాటు అతని కుమారుడు అబ్దుల్లా కూడా ఉన్నారు. <br />అయితే, గతంలో యోగి, ఆజంఖాన్ ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండేవి. ఒకసారి యోగి మాట్లాడుతూ.. నమాజ్, సూర్య నమస్కారాలూ దాదాపు ఒకేలా ఉంటాయని అన్నారు. దీనిపై ఆజంఖాన్ స్పందిస్తూ.. అలా అయితే సూర్య నమస్కారాలకు బదులు నమాజ్ చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు. <br />వారిద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు, ప్రత్యర్థులు. కానీ, వారు మాట్లాడితే సంచలనమో, వివాదాస్పదమో అవుతుంది. రెండు వ్యతిరేక వర్గాలుగా ఉన్న ఆ నేతలిద్దరూ కలిశారు. చేతులు కలిపారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఈ పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.