Residents of RK Nagar, a constituency in northern Chennai, will start filing into polling centres at 8 AM today to elect the MLA who will succeed J Jayalalithaa in the Tamil Nadu Assembly. <br /> <br />తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక గురువారం జరుగుతోంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. <br />2.80 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ మధుసూదన్, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్, బీజేపీ నేత కరు నాగరాజన్లు మధ్యే ప్రధానంగా ఉన్నారు. <br />ప్రధాన పోటీ మరుదుగణేశ్, దినకరన్, ఇ. మధుసూదన్ల మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. 208 పోలింగ్ బూత్లున్న ఈ నియోజకవర్గంలో 200 సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.