Andhra Pradesh government started distribution of 'Chandranna Christmas Kanuka (gift)' from Wednesday. State civil supplies minister Prattipati Pullarao launched the program at a fair price shop in Vijayawada <br /> <br />చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీకి బుధవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న వారికి క్రిస్మస్, సంక్రాంతి కానులను అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు రకాల సరకులను ఈ కానుక కింద రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. <br />ప్రతీ కుటుంబానికి కేజీ గోధుమపిండి, అరకేజీ చొప్పున కందిపప్పు, శనగపప్పు, బెల్లం, అరలీటర్ పామాయిల్, 100 ఎంఎల్ నెయ్యిని తయారు చేసి జ్యూట్బ్యాగులో అందిస్తున్నారు. <br />ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్చార్జ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం నుంచి వచ్చే సోమవారం సాయంత్రం వరకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తారు. ప్రభుత్వం ఈ కానుకల కోసం దాదాపు 360 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానుకల్లో నాణ్యత లోపిస్తే, చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకలను జనవరి 1 నుంచి పంపిణీ చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. <br />కాగా చంద్రన్న కానుకలో మంచి నాణ్యత గల సరుకులు అందజేస్తున్నామని, ఎక్కైడెనా నాణ్యత లేని సరుకులు వస్తే వాటిని కార్డుదారులు తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రజలకు సూచించారు.