Surprise Me!

Cauvery Water Dispute : Karnataka's Gain Is Tamil Nadu's Loss

2018-02-16 210 Dailymotion

The Supreme Court on Friday said that Karnataka will get additional 14.75 TMC of cauvery water, Tamil Nadu will now get 177.25 instead of 192 TMC water. <br /> <br />కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. తమిళనాడుకు 177.25 టీఎంసీల జలాలు కేటాయించగా, కర్ణాటకకు 284.75 టీఎంసీల జలాలను కేటాయించింది. ఈ తీర్పు ప్రకారం కర్ణాటకకు అదనంగా 14.5 టీఎంసీల నీరు లభిస్తుంది. కేరళ, పుదుచ్చేరికి జలాల కేటాయింపుల్లో మార్పు లేదు. <br />2007లో కావేరీ జలాలను లెక్కించిన సీడబ్ల్యూడీటీ ట్రిబ్యునల్ గతంలో 30 టీఎంసీల జలాలు కేరళకు, 7 టీఎంసీల జలాలు పుదుచ్చేరికి కేటాయించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. జలాలపై ఏ రాష్ట్రానికీ ఓనర్‌షిప్ హక్కులు ఎవరికీ లేవని కూడా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ తీర్పులో స్పష్టం చేసింది. <br />సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకకు 14.5 టీఎంసీలు నీరు అదనంగా మిగిలింది. అంతే కాకుండా బెంగళూరు నగరానికి 4.2 టీఎంసీల అదనపు నీరు సరఫరాకానుంది. దశాభ్దాల కాలంగా తమిళనాడు, కర్ణాటక చేసిన న్యాయపోరాటంలో చివకి కర్ణాటక సుప్రీం కోర్టులో విజయం సాధించింది. <br />కాగా 2016 సెప్టెంబర్ 5న అత్యున్నత న్యాయస్థానం పదిరోజుల పాటు తమిళనాడుకు రోజుకు 15,000 క్యూసెక్కులు చొప్పున నీళ్లివ్వాలని ఆదేశించడంతో ఇరురాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ తీర్పుపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తడం తో ఆ ఉత్తర్వును సవరించాలనంటూ కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. <br />

Buy Now on CodeCanyon