Exactly eight years ago, Tendulkar became the first cricketer to score a double hundred in One-Day Internationals as he guided India to a series victory over South Africa, with a game to spare. <br /> <br />ఫిబ్రవరి 24... అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ రికార్డు ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చివేసింది. భారత అభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ ఈ రికార్డుని నమోదు చేశాడు. <br />ఆ రికార్డు ఏంటంటే వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ. 2010 ఫిబ్రవరి 24న ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. అప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనత సాధించి క్రికెట్లో ప్రపంచ రికార్డుని తన పేరిట లిఖించాడు. <br />ఈ మ్యాచ్లో 147 బంతులను ఎదుర్కొన్న సచిన్ 25 ఫోర్లు, 3 సిక్స్ర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో భారత్ వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్ 401 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 153 పరుగుల తేడాతో పర్యాటక దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. <br />తొలి సెంచరీని 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన సచిన్... అనంతరం బ్యాటింగ్లో వేగం పెంచి కేవలం 57 బంతుల్లోనే మరో వంద పరుగులు బాదాడు. ఇందులో 25 ఫోర్ల ద్వారానే 100 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఏడాది టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ (219) పరుగులతో డబుల్ సాధించిన సంగతి తెలిసిందే. <br />