Sridevi's co-star, MP Murali Mohan recollected some memories with the actress. He said Sridevi suffered to reach her ultimate position in the film industry. <br /> <br />శ్రీదేవి మరణం యావత్ లోకాన్ని విషాద సంద్రంలో ముంచేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్తో సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ శ్రీదేవి తో తన అనుభవాలను పంచుకొన్నారు. మురళీ మోహన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. <br />శ్రీదేవి మరణించారనే వార్త ఆదివారం ఉదయం 5.30 గంటలకు తెలిసింది. కానీ అది తప్పుడు వార్త అని అనుకొన్నాను. ఏదో రూమర్ అయి ఉంటుంది అనే ఉద్దేశంతో టెలివిజన్ పెట్టి చూడగానే ఆ వార్త నిజమని తెలిసింది. దాంతో షాక్కు గురయ్యాను. <br />బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగింది. సినీరంగంలో మహోన్నత శిఖరాన్ని అధిరోహించిన ఆమెకు కష్టాలు లేవనుకోవడం తప్పు. ఎంతో మానసిక వ్యధ అనుభవించింది. <br />సినీరంగంలో రాణించడం వెనుక శ్రీదేవి తల్లిది కీలకపాత్ర. నటిగా ఆమెను బాగా తీర్చిదిద్దారు. ఎల్లవేళలా వెంట ఉండి శ్రీదేవికి అన్నిరకాల సహాయ, సహకారాలు అందించారు. <br />తన వ్యక్తిగత జీవితంలో, ప్రొఫెషన్లో కీలక పాత్ర పోషించిన తన తల్లి మరణించినపుడు శ్రీదేవి మానసికంగా కుంగిపోయింది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. <br />శ్రీదేవి అందరితో కలిసిపోదు అనడంలో వాస్తవం లేదు. తనకు పరిచయమైన వారందరితో కలివిడిగా ఉంటుంది. ముభావంగా కనిపించినా తనకు నచ్చిన వాళ్లతో బాగాను ఉంటుంది. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రభావం శ్రీదేవి ముఖం మీద కనిపిస్తుందేమో తెలియదు. <br />శ్రీదేవితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మేము చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే సరికి శ్రీదేవి దేశంలోని ఓ సూపర్స్టార్గా మారింది. మేము తక్కువ బడ్జెట్తో రూపొందిచే వాళ్లం కనుక ఆమెతో సినిమా తీసే అవకాశం లభించలేదు.