Rohit Sharma-led India enter the tournament against Sri Lanka and Bangladesh as favourites. India got one-day international and T20 series wins over South Africa earlier this month. <br />ముక్కోణపు టీ20 సిరీస్లో పాల్గొనేందుకు గాను రోహిత్శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంకకు బయల్దేరి వెళ్లింది. కొలంబోకు వెళ్లే ముందు ఆటగాళ్లందరూ ముంబై విమానాశ్రయంలో కలిసి దిగిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. <br /> <br />రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లు ధోని, భువనేశ్వర్, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ ఈ సిరిస్లో కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్తో పాటు దీపక్ హుడా, సుందర్, విజయ్ శంకర్, రిషబ్ పంత్లు చోటు దక్కించుకున్నారు. <br /> <br />శ్రీలంక స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ మంగళవారం ఆతిథ్య శ్రీలంక, భారత్ మధ్య జరగనుంది. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి. టాప్లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి. <br />