YSRCP MP Vijayasai Reddy said that they hope BJP regarding special status promise to Andhrapradesh, it's indicating that YSRCP may planning to go with BJP <br /> <br />జాతీయ న్యూస్ చానల్ 'ఇండియా టుడే'లో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో భాగంగా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ విజయసాయిని ప్రశ్నించారు. <br /> <br />తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న ప్రశ్నకు.. కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని విజయసాయి పేర్కొన్నారు. <br /> <br />కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదన్న విజయసాయి బీజేపీపై సానుకూలంగా స్పందించడం గమనార్హం. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బీజేపీతో జతకట్టడానికి ఆ పార్టీ ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది. <br /> <br />హోదా బీజేపీ మాత్రమే ఇవ్వగలదన్న నమ్మకాన్ని వైసీపీ ఓవైపు వ్యక్తం చేస్తూనే.. మరోవైపు అవిశ్వాసానికి సిద్దపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. అంటే, కేవలం టీడీపీని ఇరుకునపెట్టేందుకే ఆ పార్టీ అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.