Surprise Me!

ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రైవేట్ జెట్లో చిరు ఫ్యామిలీ

2018-03-19 2,134 Dailymotion

Megastar Chiranjeevi, Ram Charan, Surekha, Upasna, Sushmita with her kids and husband, Sreeja and Kalyan Kanuganti, and the one n only Allu Arvind travelling through a charted flight to Vizag. They all have attended Rangasthalam pre-release event yesterday. <br /> <br />రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్‌లో ఆదివారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో చిరంజీవితో పాటు సురేఖ, అల్లు అరవింద్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, శ్రీజతో పాటు ఆమె భర్త కల్యాణ్, మెగా ఫ్యామిలీ కిడ్స్ హాజరైన సందడి చేశారు. <br />ఈ వేడుకలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వైజాగ్‌కు ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ బుక్ చేసుకుని వెళ్లారు. రోడ్డు మార్గాన వెళితే చాలా సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల ఇలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. <br />ఆదివారం సాయంత్రం హైదరబాద్ నుండి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ‘రంగస్థలం' ప్రీ రిలీజ్ వేడుక ముగిసిన అనంతరం రాత్రి వైజాగ్ లోనే బస చేశారు. సోమవారం ఉదయం అంతా కలిసి మళ్లీ అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. <br />మెగా ఫ్యామిలీ ప్రైవేట్ జెట్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. మెగా ఫ్యామిలీ తమ రేంజికి తగిన విధంగా ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లారని చర్చించుకుంటున్నారు అభిమానులు. ఈ ఫోటోలో చిరంజీవి తన కాలును కొడుకు చరణ్ కాలుపై పెట్టి ఫోటోలకు ఫోజు ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. <br />

Buy Now on CodeCanyon