Telugudesam Party MP Kesineni Nani on Wednesday lashed out at Congress leader Chiranjeevi and Jana Sena chief Pawan Kalyan. <br /> <br />కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. <br />చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ అని, పవన్ జనసేన ప్రీపేయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్నారు. అలాంటి సమయంలో తన అన్నయ్య చిరంజీవిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. <br />నాడు అన్నను ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం సరికాదని కేశినేని నాని అన్నారు. బీజేపీకి పోయే కాలం వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందన్నారు. <br />సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడాన్ని కేశినేని నాని తప్పుబట్టారు. సభను ఆర్డర్లో ఉంచాల్సిన బాధ్యత సభాపతిదే అని చెప్పారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశ్యం కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు. ఆ ఆలోచన ఉండి ఉంటే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎంపీలతో మాట్లాడేవారని తెలిపారు. <br />అంతకుముందు, ఎంపీలు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము రోజుల తరబడి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ నుంచి స్పందన లేదన్నారు. తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అందరూ గమనిస్తున్నారని తెలిపారు. నాడు కాంగ్రెస్ చేసిన తప్పునే ఇప్పుడు బీజేపీ చేస్తోందన్నారు.