A WhatsApp message has gone viral that says Delhi will soon suffer a huge earthquake of magnitude 9.1 on the Richter scale. The panic the fake message created also spread to Twitter <br /> <br />దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించబోతోందని సోషల్ మీడియాలో సందేశాలు ఇప్పుడు కలకలంగా మారాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఇప్పటికే హెచ్చరికలు చేసిందంటూ ఆ సందేశాల్లో పేర్కొనడం జరిగింది. <br />ఏప్రిల్ 7 నుంచి 15లోపు ఢిల్లీలో ఒక తీవ్రమైన భూకంపం రానుంది. రిక్టారు స్కేలు మీద దాని తీవ్రత 9.1-9.2గా నమోదు కానుంది. లక్షల మంది ప్రాణాలు కొల్పోనున్నారని పేర్కొంటున్న వాట్సప్ సందేశాలు ఢిల్లీ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. <br />అంతేగాక, ‘గురుగ్రామ్లో సంభవించబోయే ఈ భూకంపం ప్రపంచంలో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించిన వాటిలో రెండవది కానుంది. భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి గురికానున్నాయి' అని ఆ సందేశాల్లో పేర్కొనడం జరిగింది. <br />ఇంకా, ‘పాకిస్థాన్లో కూడా భూకంపం రానున్నట్లు అక్కడ దీని తీవ్రత 4-4.2 వరకు నమోదు కానున్నట్లు ఈ సందేశం సారాంశం. ‘ఢిల్లీలో ఉంటున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. వారిని ఒక వారం పాటు ఢిల్లీని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లమని చెప్పండి. ప్రభుత్వం తొందరలోనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే నాసాఅలర్ట్.కామ్లో చూడండి' అని ఆ సందేశాల్లో ఉంది. <br />అయితే, నిజంగానే ఢిల్లీలో భూకంపం రానుందా? అంటే మాత్రం అదేమి లేదు. ఇది ఒక ఫేక్ మెసేజ్. మెసేజ్లో చాలా స్పెల్లింగ్ మిస్టెక్లు ఉండటమే గాక ఒక ముఖ్యమైన ప్రాధమిక అంశాన్నే అది మర్చిపోయింది.
