Sunrisers Hyderabad will play 7 games at their home ground Rajiv Gandhi worldwide stadium, Hyderabad. They may face Rajasthan Royals within the first sport at house on April 9 <br /> <br />హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తోన్న అభిమానులు ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను శుక్రవారం ప్రారంభించింది. <br />ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన మ్యాచ్ల కోసం టిక్కెట్లు కావాల్సిన వారు sunrisershyderabad.in వెబ్సైట్లో కొనుగోలు చేయాల్సి ఉంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుంచి మే 19 వరకు జరిగే మొత్తం 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఈ సైట్లో అందుబాటులో ఉంచారు. <br />అంతేకాదు టికెట్లను కొనుగోలు చేసే అభిమానుల కోసం 5, 10 శాతం డిస్కౌంట్తో ప్రాంఛైజీ ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్లతో అభిమానులు సన్రైజర్స్ హైదరాబాద్ జెర్సీలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాగా, టిక్కెట్ ధరలను ఆరు కేటగిరీలగా విభజించారు. <br />రూ.500, రూ.781.25, రూ. 976.56, రూ.1,171.88, రూ.2,734.38, రూ.3,906.25 ధరలతో టిక్కెట్లను అందుబాటులో ఉన్నాయి. నగరంలోని 15 ఔట్లెట్ల ద్వారా సన్ రైజర్స్కు చెందిన మ్యాచ్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఐపీఎల్ 11వ సీజన్లో భాగంగా సొంతగడ్డపై హైదరాబాద్ ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.
