Former MP Undavalli Arun Kumar responded on Cine Actor Sivaji comments on politics. <br /> <br />ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ లాంటి వాటితో దక్షిణాదిపై ఓ జాతీయ పార్టీ కన్నేసిందని సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయని అన్నారు. <br />రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేసి పొలిటికల్ ఆపరేషన్ చేస్తాయని అనుకోవడం అవివేకమే అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. <br />ఆపరేషన్ గరుడకు రూ. 4800 కోట్లు కేటాయించారన్న శివాజీ వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందిస్తూ.. ప్రజల ఓటింగ్ను బట్టే పార్టీలు గెలుస్తాయని, పార్టీల వ్యూహాలతో కాదని స్పష్టం చేశారు. పార్టీల వ్యూహాలు కేవలం ఓటింగ్ను ఆకర్షించడానికి మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. <br />డబ్బుతోనే గెలుస్తామనుకుంటే.. టాటాలు, అంబానీలు వద్ద మన బడ్జెట్ అంత డబ్బుందని.. నిమిషాల్లో వారు గవర్నమెంటును మార్చేయగలరని చెప్పారు. అయితే, శివాజీ కథ చెప్పారని తాను అనడం లేదని, ఆయన కథే చెప్పాలనుకుంటే నిన్నే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. <br />ఎవరో కళ్యాణ్ జీ అనే వ్యక్తి చెబితే.. శివాజీ నమ్మి ఉంటారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో లోకసభలో వెల్లో కనీసం 100మంది సభ్యులు ఆందోళన చేస్తున్నారని, ఆ ఆందోళనల్లో రాష్ట్రాన్ని విభజించారని ఉండవల్లి అన్నారు. <br />సభలో ఉన్న సభ్యులను లెక్కించడానికి అప్పుడు వీలైనప్పుడు.. ఇప్పుడెందుకు కాదని లోకసభ స్పీకర్ను ఉండవల్లి ప్రశ్నించారు.