MS Dhoni was almost in tears as he spoke on the return of Chennai Super Kings in the 11th edition of the Indian Premier League <br /> <br />మిస్టర్ కూల్ ధోనీ భావోద్వేగానికి గురైయ్యాడు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మహీ ఫ్రాంచైజీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాడు. రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని ఈ ఏడాది తిరిగి ఐపీఎల్లో ఆడుతున్న జట్లు చెన్నై సూపర్కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. మరో వారం రోజుల్లో ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. <br />పునరాగమనం చేస్తోన్న జట్టుకు మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహిస్తున్నాడు. నిషేధం కారణంగా గత రెండేళ్లు సొంత జట్టుకు దూరమై రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. 'ఇప్పుడు తిరిగి సొంత జట్టుకు ఆడుతున్నాను. ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితమైనది. ఝార్ఖండ్, టీమిండియా, ఐపీఎల్లో టీ20కి క్రికెట్ ఆడాను. ఝార్ఖండ్ తరఫున ఆడింది చాలా తక్కువ.' అని పేర్కొన్నాడు. <br />ఇంకా మాట్లాడుతూ.. 'భారత్ తరఫున ఇప్పటి వరకు 89 మ్యాచ్లు ఆడిన నేను చెన్నై తరఫున ఎనిమిదేళ్లలో 159 మ్యాచ్లు ఆడాను. తిరిగి ఈ ఏడాది చెన్నై జట్టు జెర్సీ ధరించడం ఎంతో ఆనందంగా ఉంది' అని ధోనీ భావోద్వేగంతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. <br />తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
