If reports are anything to go by, Young Tiger Jr NTR and Mega Powerstar Ram Charan will preside over the audio launch of Prince Mahesh Babu’s ‘ Bharat Ane Nenu’, scheduled to take place on April 7 in LB stadium, Hyderabad, as its chief guests. It is a pleasant surprise for the fans of both the Tollywood stars as all the biggies would be seen in on one stage together. <br /> <br />సూపర్స్టార్ మహేష్బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. <br />ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ 'భరత్ బహిరంగ సభ' పేరుతో ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభంగా జరగనుంది. <br />తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్ చీఫ్ గెస్టులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ముగ్గురు పెద్ద హీరోలు ఒక వేదికపై కనపడి అభిమానులకు కన్నుల విందు చేయడం ఖాయం. <br />కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. భరత్ అనే నేను టైటిల్ సాంగ్, 'ఐ డోంట్ నో' పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు.