YSRCP Leader Peddireddy Ramachandra Reddy alleged that CM Chandrababu came to delhi for his political lobbying. He alleged Babu is fearing about corruption allegations against him <br /> <br />ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనపై అనేక సందేహాలు ఉన్నాయని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, తనపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే హస్తినకు వస్తున్నారని ఆరోపించారు. <br />పోలవరం ప్రాజెక్టు అవినీతి, మంత్రి లోకేష్పై మనీ లాండరింగ్ ఆరోపణలు చంద్రబాబును భయపెడుతున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. తనను, తన కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేయడం కోసమే ఆయన వచ్చారని పేర్కొన్నారు. <br />పార్లమెంటు మరో మూడు రోజుల్లో నిరవధికంగా వాయిదా పడుతుంటే..చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.టీడీపీ ఎంపీలకు ప్రత్యేక హోదా కోసం ఏ మేరకు దిశా చేశారని ప్రశ్నించారు. హోదా విషయంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలకే కాదు,ఆ వెంటనే ఆమరణ దీక్షలకు కూడా దిగుతారని గుర్తుచేశారు. <br />కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ అన్నివిధాలా ప్రయత్నిస్తోందని,మరి టీడీపీ ఏం చేస్తుందో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో చంద్రబాబు దేనికోసం లాబీయింగ్ చేస్తున్నారో.. అసలు ఇప్పటిదాకా ఎంపీల కార్యాచరణను ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.