Under pressure after slumping to their fourth loss in five games, defending champions Mumbai Indians (MI) have the onerous task of re-discovering their winning touch when face Sunrisers Hyderabad (SRH) in an IPL match here on Tuesday (April 24). <br />వరుసగా రెండు మ్యాచ్లలోనూ పరాజయాన్ని చవిచూసిన హైదరాబాద్ జట్టుకు మరో ఆటంకం ఎదురైంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు గాయాల బెడద పట్టుకుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ధావన్, భువనేశ్వర్ కుమార్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో యూసఫ్ పఠాన్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్కి ఎవరు దూరం అవుతారో, తుది జట్టులో ఎవరెవరు ఉంటారనేది సందిగ్ధం. <br />ఇప్పటికే ఈ మ్యాచ్కి భువనేశ్వర్ కుమార్ దూరమైనట్లు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. <br />భువనేశ్వర్ జట్టుతో పాటు ముంబై రాలేదు. నడుం నొప్పితో తీవ్రంగా బాధపడుతోన్న భువికి ఫిజియోలు విశ్రాంతి సూచించారు. అందుకే అతడు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ఆడటం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన ధావన్ ఈ మ్యాచ్కి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నా. <br />యూసుఫ్ పఠాన్ కూడా 100శాతం ఫిట్గా ఉన్నాడని చెప్పలేను. చెన్నై, పంజాబ్తో జరిగిన మ్యాచ్ల్లో రషీద్ ఖాన్ భారీగా పరుగులిచ్చాడు. అతనో వరల్డ్ క్లాస్ బౌలర్. తదుపరి మ్యాచ్లో అతడు పుంజుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు. <br />టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ సీజన్లో రెండోసారి ముంబై ఇండియన్స్తో తలపడుతున్న సన్రైజర్స్ మరోసారి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన గత మ్యాచ్లో సన్రైజర్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
