A spirited bowling effort from Sunrisers Hyderabad (SRH) handed them a second consecutive win in a low-scoring game as they edged an in-form Kings XI Punjab side by 13 runs in the Indian Premier League (IPL) 2018 encounter here on Thursday <br /> <br />ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్కు ఎదురులేదని మరోసారి నిరూపించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. <br />ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు పంజాబ్కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సన్రైజర్స్ బౌలర్లు చెలరేగిపోయారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. <br />133 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసిన సన్రైజర్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా కింగ్స్ పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఎదురైన ఓటమికి సన్రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. <br />సన్రైజర్స్ బౌలర్లు రషీద్ ఖాన్, షకిబ్ ఉల్ హాసన్లు కట్టుదిట్టమైన బంతులతో పంజాబ్ బ్యాట్స్మన్కు చుక్కలు చూపించారు. ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (32) , క్రిస్గేల్ (23) నిలకడగా ఆడి జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు.
