Telangana Chief Minister K Chandrasekhar Rao warns BJP and Congress in TRS plenary. <br /> <br /> <br />ఈ దేశానికి తెలంగాణ గడ్డ నుంచి మేలు జరగాలన్నదే తన ధ్యేయమని కేసీఆర్ అన్నారు. ఈ వేదిక పై నుంచి (ప్లీనరీ) కఠోర సత్యాలు చెబుతున్నానని కొన్ని ఉదాహరణలు చెప్పారు. మనం బీజేపీ కాదంటే కాంగ్రెస్, కాంగ్రెస్ కాదంటే బీజేపీకి ఓటు వేస్తున్నామని (కేంద్రంలో), ఇన్నాళ్లు వారి డ్రామాలు నడిచాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. <br />కావేరీ నీటి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. భారత్లో నీటి యుద్ధాలు అంటుంటారని, మీ అసమర్థ పాలన వల్లే నీటి యుద్ధాలు అన్నారు. <br />రాష్ట్రాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు, ప్రాంతాలకు మధ్య నీటి యుద్ధాలు పెట్టారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.భారత దేశ రైతాంగాన్ని ఆ పార్టీలు నష్టపరిచాయన్నారు. తమ ఫెడరల్ ఫ్రంట్ నీటి యుద్ధాలను సర్దుబాటు చేస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. <br />#TRS <br />#KCR <br />#Plenary <br />#Hyderabad <br />#Modi <br />#Rahul gandhi <br />#Amith sha <br />
