Pawan Kalyan issue effect on Naa Peru Surya. Source said that, There are political reasons behind these developments. <br /> <br />స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా మే 4న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని పరిణామాలతో ఈ సినిమా స్పెషల్ షోల విషయంలో ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏర్పడే అవకాశం ఉందని, స్పెషల్ షోలు ఉండే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. అయితే స్పెషల్ షోస్ కోసం ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు సమాచారం. <br />ఇంతకు ముందు విడుదలైన ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' చిత్రాలకు ఏపీలో స్పెషల్ షోల కోసం పర్మిషన్ ఇచ్చారు. ‘రంగస్థలం' చిత్రానికి మార్చి 30 నుండి ఏప్రిల్ 5 వరకు, ‘భరత్ అనే నేను' చిత్రానికి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 వరకు తెల్లవారు ఝామున 5 గంటల నుండి 10 గంటల మధ్య స్పెషల్ షోస్ వేసుకోవడానికి అనుమతి లభించింది. రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబుకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో మంచి సంబంధాలు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని టాక్. <br />అయితే ‘నా పేరు సూర్య' విషయంలో ఇది సాధ్యం అయ్యే పని కాదని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని ఇష్యూలు, టీడీపీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీకి మద్దతుగా ఉన్నాయంటూ కొన్ని టీవీ ఛానల్స్ మీద పవన్ కామెంట్స్.... పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ ఫిల్మ్ చాంబర్ వెల్లడం లాంటి పరిణామాలు ఇందుకు కారణం అనే వాదన వినిపిస్తోంది. <br />#naa peru surya <br />#allu arjun <br />#anu emmanuel <br />#vakkantham vamsi