Ram Charan spends 40 cr for 1 Scene In Sye Raa. Chiru working till 3am at sets <br /> <br />మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అబ్బురపరిచే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. <br />సైరా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా చిరు ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. <br />ప్రస్తుతం హైదరాబాద్ శివారులో సైరా షూటింగ్ జరుగుతోంది. యుద్ధ సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. తెల్లవారు జాము 3 గంటలవరకు కూడా షూటింగ్ కొనసాగుతోంది. అయినప్పటికీ మెగాస్టార్ చిరు చాలా ఎనర్జిటిక్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ ఎనర్జీతో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతున్నారు. <br />యుద్ధ సన్నివేసాల కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం జరుగుతున్న వార్ ఎపిసోడ్స్ కి రాంచరణ్ ఏకంగా 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సైరా ఏస్థాయిలో నిర్మించబడుతోందో అని.