Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy... <br />#news <br />#Oneindiatelugu <br />#Update <br />#Sports <br />#Movies <br /> <br />1. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్ <br />2. రైల్వే ట్రాక్పై కూలిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరికి గాయాలు <br />3. మ్యాచ్ ఓడిన అభిమానుల మనసు గెలిచిన జపాన్ <br />1. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్ <br /> తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో తన అరెస్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మంగళవారం కోర్టుకు వెళ్లారు. తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. <br />ఈ మేరకు ఢిల్లీ కోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు శశిథరూర్ను నిందితుడిగా గుర్తిస్తూ జూలై 7న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. <br />2. రైల్వే ట్రాక్పై కూలిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరికి గాయాలు <br />మహారాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్పై రైళ్ల రాకపోకను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.