<br />గురువారెడ్డి సెల్ఫీ సూసైడ్ కేసులో పోలీసులు అతని భార్య గాయత్రి, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడిపై కేసు నమోద చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్తింటి వేధింపులు భరించలేక కృష్ణలంకలో ఓ యువకుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. <br />ఆత్మహత్య చేసుకున్నందుకు తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ, తన భార్య, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు తన ఆత్మహత్యకు కారణం అని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోతో రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపడుతున్నారు. <br />ఈ ఆత్మహత్యపై గురువారెడ్డి స్నేహితులు ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ.. గురువారెడ్డి, ఆమె అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అమ్మాయి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లినప్పటి నుంచే గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. హైదరాబాదులో కార్తీక్ అనే యువకుడితో తిరగడం ప్రారంభించిందని తెలిసిందన్నారు. <br />హైదరాబాదులో మరో వ్యక్తితో తిరుగుతూ భర్తను వదిలేయాలని నిర్ణయించుకుందని ఆ స్నేహితుడు తెలిపారు. గురువారెడ్డికి తెలిసి అడిగితే స్నేహితుడు అని చెప్పిందని, తాను ఇక అతనితో తిరగనని చెప్పిందని, కానీ ఆ తర్వాత గురువారెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేదని, లిఫ్ట్ చేసినా నువ్వు హైదరాబాద్ వస్తే మాట్లాడుకుందని చెప్పేదన్నారు. <br /> <br />Man commits suicide after record a selfie video in Vijayawada. <br /> <br />
