Surprise Me!

బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర: పరిపూర్ణానంద

2018-07-09 420 Dailymotion

<br />శ్రీరామచంద్రుడిపై దారుణ వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద మహేష్ కత్తిపై శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా సోమవారం ఆయన ధర్మాగ్రహ యాత్ర ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌ బోడుప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు 3 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. హిందూ ధర్మంపై పెచ్చుమీరుతున్న కుట్రలను, మేధావుల ముసుగులో విచ్ఛిన్నకర శక్తులను ఇంకా ఎన్నాళ్లు భరించాలన్నారు. ఎన్నేళ్లు సహించాలని నిలదీశారు. ఆ కుట్రలను భగ్నం చేసేందుకే ఈ ధర్మాగ్రహ యాత్ర అన్నారు. శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు. <br /> <br />Paripoornananda Swami Press Meet at Somajiguda press club on Mahesh Kathi comments on Lord Srirama. <br />#paripoornanandaswami <br />#maheshkathi <br />#hindu <br />#kcr <br />#chandrababunaidu <br />#andhra pradesh

Buy Now on CodeCanyon