బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సాక్ష్యం' . అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా నిర్మాతగా.. శ్రీవాస్ దర్శతక్వంలో ఈ మూవీ తెరకెక్కించారు. ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ ఎంటర్టెనర్గా తీసిన చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. జులై 27న సినిమాను విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్ర గురించి జగపతి బాబు మాట్లాడుతూ 'తన పాత్ర అత్యంత కిరాతకంగా, నీచంగా ఉంటుంది' అన్నారు. <br />నేను ఇప్పటి వరకు లెజెండ్, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక చిత్రాల్లో చెప్పుకోదగిన విలన్ పాత్రలు చేశాను. ఆ విలన్ పాత్రలకు మించి పోయేలా, భయంకరంగా ‘సాక్ష్యం'లో విలన్ పాత్ర ఉంటుంది అని జగపతి బాబు తెలిపారు. <br />తెరపై నేను పోషించిన విలన్ పాత్ర చూసిన ప్రేక్షకుడు ఇంతకన్నా నీచుడు వుండడు అనే భావనకు వస్తారని తెలిపారు. అలాంటి విలన్ గా నేను ఈ సినిమాలో కనిపిస్తాను... అని జగపతి వెల్లడించారు. <br /> <br />Jagapathi Babu play a Villain role in Sakshyam, Starring Bellamkonda Srinivas & Pooja Hegde, Music composed by #Harshavardhan Rameswar, Directed by Sriwaasand Produced by Abhishek Nama under Abhishek Pictures. <br />#JagapathiBabu