జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 16వ తేదీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. <br />ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాలు.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఇటీవలే ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు. <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలని భావిస్తున్నారు. <br /> <br />Jana Sena chief Pawan Kalyan to tour East and West Godavari districts from 16. <br />#JanaSena <br />#PawanKalyan