కొద్ది నెలల క్రితం ఆర్మీ జవాన్ ఔరంగజేబును మిలిటెంట్ల దారుణంగా చంపిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా సెలవులపై ఇంటికి వెళ్తున్న ఔరంగజేబును ఉగ్రవాదులు అపహరించి అత్యంత పాశవికంగా చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న విదేశాల్లోని అతని స్నేహితులు కొందరు ఉద్యోగాలు వదులుకొని భారత్ వచ్చారు. <br />ఔరంగజేబును ఉగ్రవాదులు హత్య చేసిన విషయం తెలియగానే అతని ఇంటి సమీపంలో ఉండేవారు, కొందరు స్నేహితుల రక్తం ఉడికిపోయింది. దీంతో గల్ఫ్ తదితర దేశాల్లో ఉండే 50 మంది ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు కాశ్మీర్ గడ్డపై అడుగు పెట్టారు. వారు దక్షిణ కాశ్మీర్లోని మెందర్లోని తమ గ్రామమైన సలానికి చేరుకున్నారని వార్తలు వస్తున్నాయి. <br />#aurangzeb <br />#JammuKashmir <br />#friends <br />#army <br />#police
