ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హిమదాతా సినిమాస్ సమీపంలోని క్రిస్టల్ టవర్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో మంటలు చెలరేగడంతో భవనంతా పొగ వ్యాపించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ అగ్ని ప్రమాదాన్ని ముందు లెవెల్-2గా భావించినా తర్వాత తీవ్రతను బట్టి లెవెల్-3గా అంచనా వేశారు. <br />#parel <br />#MumbaiCrystalTower <br />#himdatacinemas <br />#Exit <br />#HighAlert <br />#Extinguisher