IPL 2019: Most successful teams of the IPL—Mumbai Indians and Chennai Super Kings—final in Hyderabad on Sunday, following a rather eventful season that produced some unprecedented moments on the field. <br />#ipl2019 <br />#cskvmi <br />#msdhoni <br />#iplfinal <br />#chennaisuperkings <br />#mumbaiindians <br />#shanewatson <br />#rohitsharma <br /> <br />ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. <br />ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబయి ఇండియన్స్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంటోంది. పవర్ప్లేలో దూకుడుగా ఆడిన ఓపెనర్లు డికాక్ (29: 17 బంతుల్లో 4x6), రోహిత్ శర్మ (15: 13 బంతుల్లో 1x4, 1x6) వరుస ఓవర్లలో పెవిలియన్కి చేరగా.. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ (23: 26 బంతుల్లో 3x4), సూర్యకుమార్ యాదవ్ (15: 17 బంతుల్లో 1x4), కృనాల్ పాండ్య (7: 7 బంతుల్లో) పేలవంగా వికెట్ చేజార్చుకున్నారు. దీంతో.. 17 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 120/5తో నిలిచింది. <br />మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్లో ఇప్పటికే ఈ రెండు జట్లూ మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్ల్లోనూ ముంబయి ఇండియన్స్ జట్టే విజయం సాధించింది. దీంతో.. ఈ ఫైనల్ మ్యాచ్లో గెలిచి లెక్క సరిచేయాలని చెన్నై టీమ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు నాలుగో టైటిల్పై కన్నేసిన ముంబయి టీమ్ అదే గెలుపు జోరుని కొనసాగించాలని ఆశిస్తోంది. 12 ఏళ్ల ఐపీఎల్లో ఇప్పటికే ఈ రెండు జట్లూ చెరో మూడు టైటిల్స్ గెలవగా.. ఈరోజు ఏ జట్టు గెలిచినా.. సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో 4వ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా రికార్డుల్లో నిలవనుంది.