1720లలో అసఫ్ జాహీల పాలనా కాలంలో తవ్వించిన మెట్ల బావిని ప్రభుత్వం సహకారంతో ఓ సొసైటీ పునరుద్ధరించింది. దీన్ని ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అతి త్వరలో ఇక్కడికి సందర్శకులను అనుమతించనున్నారు.. ప్రస్తుతం బావితో పాటు దీని చుట్టూ గార్డెన్ను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అనంతరం పర్యాటకులను అనుమతించనున్నారు.
