ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. మొక్కలపై పరిశోధనలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న పటాన్చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ఇక్రిశాట్కి చేరుకున్నారు.
