దేశంలోని అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుకా సింగ్ విచ్చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో కేంద్ర మంత్రులు మేడారం చేరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. వనదేవతలకు తూలభారంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అమ్మల గద్దెల వద్దకు వెళ్లి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు.
