ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీపీఎస్సీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంపై ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్కు అభినందనలు తెలిపారు.ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ఉన్న ఉదయ్భాస్కర్ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి పదవి ఖాళీగా ఉంది. దీంతో డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సవాంగ్ను ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
