Surprise Me!

ఇప్పుడు మేం ముగ్గురమే కావచ్చు.. రేపు జరిగేది మాత్రం అదే: ఈటల

2022-03-07 146 Dailymotion

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌ పార్క్‌ తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు నివాళులు ఆర్పించారు.. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణలో నిర్భంద పాలన నశించాలంటూ నినాదాలు చేశారు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగం.. దీని మీద చర్చించడం ఎమ్మెల్యేగా మా హక్కు.. కానీ కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు.. గవర్నర్‌కే దిక్కు లేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతోంది. మేము ఇప్పుడు ముగ్గురమే కావొచ్చు.. కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’ అని వ్యాఖ్యానించారు.

Buy Now on CodeCanyon