కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కమిషనర్ వి.సత్యనారాయణ గురువారం పోటీలను ప్రారంభించారు.. అనంతరం క్రీడాకారులతో మాట్లాడారు. ఈ పోటీల్లో 12 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల ఉండటంతో ఆయనకు వీలు కాలేదు.
