తిరుపతి పశు వైద్య కళాశాల విద్యార్థులు.. కాలేజీ భవనాలు ఎక్కి దూకేస్తామంటూ బెదిరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పశు వైద్య విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి, వెటర్నరీ విశ్వ విద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
