Surprise Me!

యాదాద్రి ఆలయంలో రాచకొండ సీపీ.. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

2022-03-28 3 Dailymotion

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సీపీ మహేశ్ భగవత్ ఆదివారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ప్రారంభోత్సవానికి రాచకొండ పోలీసుల ద్వారా అన్ని రకాల సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు అందజేస్తామని, ఆలయ ప్రాంగణంలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిరక్షణకు ఎస్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక బృందాన్ని నియమిస్తామన్నారు. యాదగిరిగుట్ట ప్రారంభోత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, ఆలయ ప్రాంగణంలో సివిల్‌ పోలీస్‌ బృందాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, మహిళా భక్తుల సహాయార్థం షీ టీమ్‌లను కూడా నియమిస్తామని సీపీ తెలిపారు.

Buy Now on CodeCanyon