ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చేస్తున్న వాదనలు వింతవాదనలు, వితండ వాదనలు అని అన్నారు. 48 వేల కోట్ల రూపాయలకు లెక్కలు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. ఆదాయం తగ్గిపోతే రూ.2 లక్షల 56 వేల కోట్ల భారీ బడ్జెట్ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెట్టారని నిలదీశారు.
