Minister Ponguleti Visit Sitarama Project : గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట రూ. 8,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని తోడేళ్లగూడెం వద్ద కొనసాగుతున్న కాల్వపనులు, ఇతర పనులను మంత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన సాగడంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
