PCB And APMDC Documents Burnt Issue: కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనం ఘటనలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కీలక దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డు డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ ఘటనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దస్త్రాల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేంటో చెప్పాలని ఆధికారులను ఆదేశించారు.
