Ramoji Rao Memorial Sabha at CR Foundation : ప్రజాహితం తప్ప, ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడు రామోజీ తలవంచలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, రాజకీయ కష్టం లేదా ప్రకృతి వైపరీత్యాలు, పాలనాపరమైన ఇబ్బందులొచ్చినా ప్రజల పక్షాన మాత్రమే నిలబడ్డారని మంత్రి కొనియాడారు.
