సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ కోసం బృందంతో కలిసి జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.