ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని సీఎం చంద్రబాబు తెలిపారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధుపండిత్ దాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు. వెంకటేశ్వరస్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని, ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్షపెట్టారని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
