Victims Suffering due to Land Grab During YSRCP Government : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన భూకజ్జాలకు నేటికి ముగింపు దొరకలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అధికారులు, బాధితులు ఇంకా కోర్టుల చూట్టూ తిరుగుతునే ఉన్నారు. ఆక్రమణలపై సిట్ వేసిన జగన్ ప్రభుత్వం దాన్నీ నీరుగార్చింది. సిట్లో ఉన్న పోలీస్ అధికారుల్లో కొందరు <br />ఇరువర్గాల నుంచి బాగా డబ్బులు గుంజుకుని లాభపడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త అధికారులతో సిట్ వేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.