Surprise Me!

కరెంటు బిల్లు కట్టమన్నందుకు దాడి

2024-07-18 5,681 Dailymotion

Kickboxer attack on electricity staff : కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్​ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.<br /><br /> విద్యుత్​ సంఘ నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్​ లైన్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న హెచ్​.శ్రీకాంత్​, మీటర్​ రీడర్​ సాయి గణేశ్​ ఉదయం మోతీనగర్​ మీటర్​ రీడింగ్​కు వెళ్లారు. మోతీనగర్​లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి రూ.9,858 చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్​ సిబ్బంది ఎంసీబీ ఆఫ్​ చేసి విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు.

Buy Now on CodeCanyon